ప్రో కబడ్డీ క్రీడాకారులకు ఉప్పల ఫౌండేషన్ చేయూత..

by Sumithra |
ప్రో కబడ్డీ క్రీడాకారులకు ఉప్పల ఫౌండేషన్ చేయూత..
X

దిశ, చైతన్య పురి : క్రీడాకారులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. అండర్ 14 ప్రో కబడ్డీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నాగోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు యూనిఫాం, షూస్ ను ఏసీపీ నరేష్ రెడ్డితో కలిసి ఆయన అందజేసి మాట్లాడారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించి సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి జాతీయస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని ఆయన అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కోచ్ శంకర్, మమత, వెంకటేష్, రవికుమార్ జయప్రద, మాధవి, విమల తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed