మర్డర్ కేసులో ముగ్గురు రిమాండ్..

by Kalyani |
మర్డర్ కేసులో ముగ్గురు రిమాండ్..
X

దిశ,కార్వాన్ : ఆస్తి తగాదాలలో ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేకెత్తించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసు ముగ్గురు నిందితులు రిమాండ్ అయ్యారు. గోషామహల్ ఏసీపీ వెంకట్ రెడ్డి ఇన్స్పెక్టర్ మహేష్,ఎస్సై మహేందర్ లతో కలిసి మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు. మంగళ్ హాట్ టక్కరి వాడికి చెందిన దుర్గేష్ సింగ్, బజరంగ్ సింగ్ ఇరువురి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. దుర్గేష్ సింగ్(40) ప్రైవేట్ జాబ్ చేస్తుండగా, రఘువీర్ సింగ్ కుమారుడు బజరంగ్ సింగ్ స్థానికంగా టీ స్టాల్ నడుపుతున్నాడు.

బజరంగ్ సింగ్ తన బంధువులు తుల్జారాం సింగ్, సత్యనారాయణ సింగ్ లు కలిసి దుర్గేష్ సింగ్ కు ఆదివారం రాత్రి ఫోన్ చేసి మాట్లాడుకుందామని బయటికి పిలిచారు. వెంటనే దుర్గేష్ సింగ్ ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. కాగా ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బజరంగ్ సింగ్, తుల్జారాం సింగ్, సత్యనారాయణ సింగ్ ఆస్తి తగాదాల విషయంలో ముగ్గురు కలిసి దుర్గేష్ సింగ్ పై దాడి చేశారు. ఈ దాడిలో దుర్గేష్ సింగ్ మృతి చెందినట్లు ఏసీపీ తెలిపారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు బజరంగ్ సింగ్, తుల్జారాం సింగ్, సత్యనారాయణ సింగ్ లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని మంగళవారం సాయంత్రం రిమాండ్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed