- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టాస్) ఏర్పాటు చేయాలి
దిశ, హైదరాబాద్ బ్యూరో : కేరళ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హనుమంతు నాయక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కొన్ని కార్పొరేషన్ లకు ఎండిలుగా గ్రూప్ 1 అధికారులను నియమించారని, వారికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. 2015 లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై అధ్యయనానికి ఆరుగురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీ వేసిందని, ఇప్పటికీ ఐఏఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి తమ తుది నివేదికను సమర్పించలేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరత దృష్ట్యా ప్రతిభావంతులైన గ్రూప్ 1 అధికారులను కార్పొరేషన్ ఎండిలుగా , స్థానిక సంస్థల్లో అనుభవం ఉన్న గ్రూప్ 1 అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు . తాము అతి త్వరలో ముఖ్యమంత్రితో పాటు చిన్నారెడ్డి కమిటీని , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి తమ సమస్యలను విన్నవిస్తామని చంద్రశేఖర్ తెలిపారు. ఈ సమావేశంలో గ్రూప్ 1 అధికారులు వేణుమాధవ్ రెడ్డి, సయ్యద్ యాసీన్ ఖురేషి, అలోక్ కుమార్ ,అంజన్ రావు అజయ్, భవాని, శశి శ్రీ, పద్మజారాణి పద్మావతి, వినయ్, సోమశేఖర్, నూతనకంటి వెంకట్ ,శరత్ చంద్ర, శ్రీరామ్ , వినోద్ రెడ్డి, షబానా, మైత్రి ప్రియ తదితరులు పాల్గొన్నారు.