ఎలక్షన్ డ్యూటీలకు గైర్హాజరైన 40 మంది పై సస్పెన్షన్ వేటు

by Disha Web Desk 12 |
ఎలక్షన్ డ్యూటీలకు గైర్హాజరైన 40 మంది పై సస్పెన్షన్ వేటు
X

దిశ, సిటీబ్యూరో : పార్లమెంట్ ఎన్నికల డ్యూటీలకు హాజరుకాని మరో 40 మంది వివిధ విభాగాలకు చెందిన అధికారులపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎన్నికల శిక్షణకు హాజరుకావాలంటూ ఎన్ని సార్లు మెసేజ్‌లు చేసినా హాజరు కాకపోవడంతోనే వారిపై సస్పెన్షన్ వేటు చేస్తున్నట్లు వివరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన కింద వారందరినీ సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు తిరిగి 9,10 వ తేదీలలో 3వ దశ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు, ఆ శిక్షణ తరగతులకు గైరాజరైయ్యే వారిపై కూడా ఇదే తరహా చర్యలుంటాయని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు.

వేటు పడిన అధికారుల వివరాలు..

స్కూల్ ఎడ్యుకేషన్ శాఖకు చెందిన కే.యాదవరెడ్డి, ఎం.సుహాసిని, మహ్మద్ సలావుద్దీన్, హఫ్స ఖుద్సియ, జకిర షహీన్, గీత, కే.మాధురి, బీ.పావని, సీఆర్.అరుణకుమారి, ఎస్.మరియా గోరెట్టి, ఆర్.లక్ష్మణ్ కుమార్, శ్రీలత, రవి నిరంజని, ఏ.రాధ, డీ. నాగరాజు, వీ.కవిత, సాదిక్ ఉన్నిసా బేగమ్, ఎం.మోహన్ రాజ్, టీ.శౌరిలమ్మ, పీ.శుభ చైత్ర, ఈ.వేణుగోపాల్, మొహమ్మద్ షమీ యుద్దీన్, మహమ్మద్ అయూబ్ ఖాన్, ఖాజా తాఖీయుద్దీన్, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, కాలేజ్ ఆఫ్ సైన్స్‌కు చెందిన జె.వెంకటేశ్వరరావు, డాక్టర్ బి.అశోక్, డాక్టర్ బి.రవీందర్‌రెడ్డి, డాక్టర్ పీ.సోమేశ్వర్, నిజాం కాలేజీకి చెందిన డాక్టర్ ఎం.లక్ష్మణ్, డాక్టర్ అప్క నాగేశ్వరరావు, పరిమళ కులకర్ణి, కోఠి ఉమెన్స్ కళాశాలకు చెందిన డాక్టర్ పీఆర్.సుష్మా, కే.దత్తాత్రేయ, డాక్టర్ ప్రియకుమారి, ఓయూ మెయిన్ క్యాంపస్‌కు చెందిన చింతపట్ల శ్రీనివాస్, జి.శ్రావన్య, డీఆర్ డీఎల్‌కు చెందిన ఎల్.యుగంధర్, కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సైదా శ్యాం అలియా, కె.సరితలను సస్పెండ్ చేయాలని ఆయా శాఖలకు సిఫార్సులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

Next Story

Most Viewed