- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
చార్మినార్లో ఈ నెల 19వ తేదీన రాజీవ్గాంధీ సద్భావన యాత్ర
దిశ, చార్మినార్ : చారిత్రాత్మక చార్మినార్ వద్ద ఈ నెల 19వ తేదీన 34వ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర జరుగనున్నట్లు బహదూర్పురా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పులిపాటి రాజేష్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కె.శ్యాంరావు ముదిరాజ్లు తెలిపారు. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక సమితి అధ్యక్షుడు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారన్నారు. చార్మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరిస్తారన్నారు. ఈ సంవత్సరం సద్భావన అవార్డును మాజీ మంత్రి డాక్టర్ గీతా రెడ్డి కి అందజేయనున్నట్లు చెప్పారు. ఇంకా ఈ సద్భావన యాత్రలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, డి.శ్రీధర్బాబు, డి.సీతక్క, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని పులిపాటి రాజేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కె.శ్యాంరావు ముదిరాజ్లు పేర్కొన్నారు.