చార్మినార్​లో ఈ నెల 19వ తేదీన రాజీవ్​గాంధీ సద్భావన యాత్ర

by Kalyani |
చార్మినార్​లో ఈ నెల 19వ తేదీన రాజీవ్​గాంధీ సద్భావన యాత్ర
X

దిశ, చార్మినార్​ : చారిత్రాత్మక చార్మినార్​ వద్ద ఈ నెల 19వ తేదీన 34వ రాజీవ్​ గాంధీ సద్భావన యాత్ర జరుగనున్నట్లు బహదూర్​పురా నియోజకవర్గం కాంగ్రెస్​ పార్టీ ఇంచార్జి పులిపాటి రాజేష్​ కుమార్, సీనియర్​ కాంగ్రెస్​ నాయకులు కె.శ్యాంరావు ముదిరాజ్​లు తెలిపారు. రాజీవ్​ గాంధీ సద్భావన యాత్ర స్మారక సమితి అధ్యక్షుడు, రాష్ట్ర బీసీ కమిషన్​ చైర్మన్​ జి.నిరంజన్​ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారన్నారు. చార్మినార్​ వద్ద కాంగ్రెస్​ పార్టీ పతాకాన్ని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్​ కుమార్​ గౌడ్​ ఆవిష్కరిస్తారన్నారు. ఈ సంవత్సరం సద్భావన అవార్డును మాజీ మంత్రి డాక్టర్​ గీతా రెడ్డి కి అందజేయనున్నట్లు చెప్పారు. ఇంకా ఈ సద్భావన యాత్రలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్​ మున్షీ, మంత్రులు ఉత్తమ్​ కుమార్​రెడ్డి, పొన్నం ప్రభాకర్​, దామోదర​ రాజనర్సింహ, డి.శ్రీధర్​బాబు, డి.సీతక్క, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్​రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని పులిపాటి రాజేష్​, సీనియర్​ కాంగ్రెస్​ నాయకులు కె.శ్యాంరావు ముదిరాజ్​లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed