ఇద్దరు మైనర్ బాలికలపై సామూహిక లైంగిక దాడి

by M.Rajitha |
ఇద్దరు మైనర్ బాలికలపై సామూహిక లైంగిక దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇద్దరు మైనర్ బాలికలపై ఐదుగురు నిందితులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పరిధిలోని సైదాబాద్ బాలికల పునరావాస కేంద్రం నుండి ఇద్దరు బాలికలు తప్పించుకొని పారిపోయారు. జనగామలో పరిచయం ఉన్నవారి ఇంటికి వెళుతుండగా.. వీరిని గమనించిన ఐదుగురు నిందితులు మాయమాటలు చెప్పి, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం వారిని కారులో తీసుకువచ్చి హైదరాబాద్ లో వదిలి వేశారు. పునరావాస కేంద్రం నిర్వాహకుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed