- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శోభాయాత్రలో చైన్ స్నాచర్ల ముఠా హల్చల్
దిశ, కార్వాన్ : ఓవైపు ఆధ్యాత్మికమైన శోభాయాత్రలో మునిగిపోయిన భక్తులు... మరోవైపు ఇదే ఛాన్స్ గా మలుచుకొని చైన్ స్నాచర్ల ముఠా విజృంభించారు. దీంతో గురువారం మంగళహాట్ పోలీస్ స్టేషన్ కు బుధవారం ఫిర్యాదు కోసం క్యూ కట్టారు. వివరాల్లోకి వెళితే... శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని నగరంలోని ఆధ్యాత్మికమైన శోభాయాత్రను నిర్వహించారు. గోషామహల్ ఎమ్మెల్యే టీ. రాజా సింగ్ శోభాయాత్రలో పాల్గొనడంతో వేలాదిమంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది.
ఈ శోభాయాత్రలో కొందరు చైన్ స్నాచర్ల ముఠా విజృంభించి, భక్తుల మెడలోని గొలుసు లతోపాటు సెల్ ఫోన్లు తస్కరించుకొని పారిపోయిన సంఘటన మంగళ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... బుధవారం మధ్యాహ్నం శోభాయాత్రలో భక్తులు ఆధ్యాత్మికమైన పాటలతో పాటు ఆటలలో మునిగిపోయారు. ఇదే అదను గా మలుచుకొని కొందరు చైన్ స్నాచర్ల ముఠా ఆధ్యాత్మిక రంగంలో మునిగిపోయిన భక్తుల మెడలో నుంచి చైన్లతో పాటు జేబులో నుంచి సెల్ ఫోన్లు తస్కరించి పారిపోయారు.
శోభాయాత్రలో మునిగిపోయిన భక్తులు తేరుకొని మెడలో చైన్ లు లేకపోవడంతో, అంతేకాకుండా సెల్ ఫోన్లు పోయిన భక్తులు కూడా మంగళహాట్ పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టారు. 8 మంది మెడలోని చైన్లు తోపాటు ఓ వ్యక్తి బ్రాస్లెట్, సుమారు 20 మంది పైనే సెల్ ఫోన్లు పోయినట్లు ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చైన్ స్నాచర్ల ముఠాను పట్టుకునేందుకు సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.