ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మద్దతుగా సీఎం దిష్టి బొమ్మ దగ్ధం

by Mahesh |
ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మద్దతుగా సీఎం దిష్టి బొమ్మ దగ్ధం
X

దిశ, కార్వాన్: గోషామహల్ నియోజకవర్గంలోని పురానాపూల్ చౌరస్తా వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. సోమవారం పురానాపూల్ చౌరస్తా వద్ద ఆ పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రేవంత్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ప్రాణహాని కలిగించేందుకు తన నివాసం వద్ద రెక్కి నిర్వహిస్తుంటే తెలంగాణ పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు ప్రాణహాని ఉన్న ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం రాజా సింగ్‌కి భద్రతను పెంచాలని, కుట్రలు చేస్తున్న వారి వెనుక ఎవరూ ఉన్న వెంటనే విచారించి.. చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో బీజేపీ కార్యకర్తలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Next Story