- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
దిశ, కార్వాన్: రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలీ లోని జెంటాక్ సాఫ్ట్వేర్ కంపెనీకి హిమాయత్ నగర్ నుండి సోమవారం ఉదయం 5 గంటలకు సాయి తేజ, సాయి సుధ, సందీప్, మాధురి, సాయి కృష్ణ, 5 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎర్టిగా కార్ లో మాసబ్ ట్యాంక్ గుండా వెళుతున్నారు. అయితే మాసబ్ ట్యాంకు ఫ్లైఓవర్ ఎక్కుతుండగా బైకును ఓవర్టేక్ చేస్తుండగా వేగంగా డివైడర్ను కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముందు సీటులో కూర్చున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి తేజ(25) అక్కడికి అక్కడే మృతి చెందగా.. మిగిలిన నలుగురికి గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని.. ఈ ప్రమాదంలోని కారు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉందని సీఐ తెలిపారు.