బ్రిడ్జి నిర్మించాలని నిరసన

by Aamani |
బ్రిడ్జి నిర్మించాలని నిరసన
X

దిశ,కాగజ్ నగర్ : రెబ్బెన మండలం లో కిష్టాపూర్ గ్రామ సమీపంలో గల వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిరసిస్తూ సోమవారం కిష్టాపూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు, విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. రెబ్బెన నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమిని మండలానికి వెళ్లే మార్గం మధ్యలో కిష్టాపూర్ గ్రామ సమీపాన నిర్మించే బ్రిడ్జి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నత్త నడకన సాగుతున్నాయన్నారు. జక్కుల పల్లి గ్రామం నుండి ప్రతిరోజు 50 మంది విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిష్టాపూర్ గ్రామం వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి పాఠశాలలకు వెళ్తున్నారన్నారు.

సాయంత్రం రెండు కిలోమీటర్లు జక్కుల పల్లి గ్రామానికి చేరుకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మే నెల బ్రిడ్జి పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ వర్షాకాలం మధ్యలోనే పనులను ఆపివేయడం తో నానా తంటాలు పడాల్సి వస్తుందన్నారు. గ్రామానికి అధికారులు రావాలంటే నరకయాతన పడాల్సి వస్తుందన్నారు. ప్రధాన రహదారిపై బ్రిడ్జి నిర్మాణం పనులు చేయకపోవడంతో వైద్యం కోసం ఇబ్బందులు తప్పడం లేదన్నారు. సంబంధిత అధికారులు బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed