డైమండ్స్, బంగారం దొంగల అరెస్ట్

by Nagam Mallesh |
డైమండ్స్, బంగారం దొంగల అరెస్ట్
X

దిశ, ఖైరతాబాద్ః 5లక్షల విలువచేసే సొత్తును దొంగలించిన 3 దొంగలను ఫిలింనగర్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ ఫేస్2లో గల రోడ్ నెంబర్ 86 లో ప్లాట్ నెంబర్ 509లో ఇంట్లో రూ.5 లక్షల విలువ చేసే 2డైమండ్ రింగ్స్, 2 బంగారు రింగ్స్, 5 వాచిలు, వెండి ఆభరణాలు, యూఎస్ డాలర్స్, మొబైల్ ఫోన్లు దొంగలించారనిని పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన ఫిలింనగర్ పోలీసులు ముద్రబోయిన మురళి(22) , అతని సోదరుడు ముద్రబోయిన నవీన్ (20) , స్నేహితుడు జూట్రూ సాంబశివరావు (24) ముగ్గురు వ్యక్తులు దొంగలించినట్టుగా గుర్తించి వారిని ఫోన్ లొకేషన్ ఆధారంగా కృష్ణాజిల్లాలో అదుపులోకి తీసుకొని దొంగలించబడిన సొత్తును స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా నిందితుడు ముద్రబోయిన మురళి ఫిర్యాదుదారుల ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు తేలింది. ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed