పౌర సేవకు అంకితమవ్వండి : రాచకొండ సీపీ

by Aamani |
పౌర సేవకు అంకితమవ్వండి : రాచకొండ సీపీ
X

దిశ, సిటీ క్రైమ్ : పోలీసు వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా విధులు నిర్వహిస్తూ పౌర సేవకు అంకితం కావాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. మంగళవారం నేరేడ్మెట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ పోలీసు శాఖకు కొత్త గా ఎంపికైన 56 మంది ట్రైని సబ్ ఇన్స్ పెక్టర్ లకు దిశ-నిర్దేశం చేశారు. సివిల్ వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ఇవ్వాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిర , ఏసీపీ నరేందర్ గౌడ్, రమేష్ లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed