Hyderabad : విమానానికి బాంబు బెదిరింపు.. బెంబేలెత్తిన ప్రయాణికులు

by M.Rajitha |
Hyderabad : విమానానికి బాంబు బెదిరింపు.. బెంబేలెత్తిన ప్రయాణికులు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నుండి వైజాగ్ వెళ్లిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం సృష్టించింది. హైదరాబాద్ నుండి వైజాగ్(Vizag) వెళ్ళిన ఇండిగో(Indigo) విమానంలో బాంబు ఉందని ఓ గుర్తు తెలియని వ్యక్తి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు కాల్ చేసి బెదిరించాడు. అప్రమత్తమైన అధికారులు వెంటనే విశాఖ విమానాశ్రయానికి సమాచారం అందించారు. అప్పటికే ఆ విమానం ముంబయి బయలు దేరడంతో.. హుటాహుటిన తిరిగి వెనక్కి రప్పించి, క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. చివరకు బాంబు లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా హైదరాబాద్ విమానానికి వచ్చిన బెదిరింపు కాల్ పై పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనలో ఏం జరుగుతుందో అర్థంకాక కొద్దిసేపు ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

Advertisement

Next Story

Most Viewed