- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎయిర్ గన్తో బెదిరించిన ఇద్దరి అరెస్ట్
దిశ, చార్మినార్ : పెట్రోల్ బంక్ సిబ్బందిని పాయింట్ బ్లాక్ రేంజ్లో ఎయిర్గన్ పెట్టి చంపేస్తానని బెదిరించి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని మీర్చౌక్ పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి ఎయిర్ గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మీర్చౌక్ ఏసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్ రావు, ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ అరుణోదయలతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 27వ తేదీన రాత్రి ఏతేబర్ చౌక్ లోని హైదరాబాద్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంకుకు పెట్రోల్ కోసం ఆలీజాకోట్లకు చెందిన భక్షి అలీ అలియాస్ జాహి అలియాస్ గోల్డి(24) , మొహమ్మద్ అర్షద్ అలియాస్ ఆర్షు(25) వచ్చారు. క్యూలైన్లో రాకుండా పెట్రోల్ పోయాలని ఆ ఇద్దరు యువకులు గొడవకు దిగారు. సిబ్బంది క్యూ లైన్లో రావాలని పెట్రోల్ బంకు సిబ్బంది సూచించారు.
దీంతో వారు అక్కడే ఉన్న ఓ రాడ్ తీసి కొట్టడానికి యత్నించారు. సిబ్బంది పట్టుకోవడంతో ఆ ఇద్దరిలో ఒక్కరు ఎయిర్గన్ తీసి పాయింట్ బ్లాక్లో గురిపెట్టి చంపేస్తానని బెదిరించాడు. వారిని పెట్రోల్ బంక్ సిబ్బంది ధైర్యం చేసి పట్టుకున్నారు. మీర్చౌక్ పోలీస్స్టేషన్కు తీసుకువెళ్తుండగా భక్షి అలీ, మొహమ్మద్ అర్షద్ అలీలు రెప్పపాటులో పరారయ్యారు. పెట్రోల్ బంక్ మేనేజర్ వినయ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న వారిద్దరిని మీర్చౌక్ పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్కు తరలించారు. వారిపై ఇప్పటికే పదహారు కేసులు ఉన్నాయని, జైలు శిక్ష కూడా అనుభవించారని తెలిపారు. ఆ ఇద్దరి పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న మీర్చౌక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.