ఆదివాసీ, గిరిజనుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే : నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్

by Disha Web Desk 11 |
ఆదివాసీ, గిరిజనుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే : నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్
X

దిశ, ఖైరతాబాద్ : రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో ఆదివాసీ, గిరిజన వర్గాల మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉషా కిరణ్ మాట్లాడారు. మూడు ఆర్థిక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆదివాసి గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఆదివాసీల జీవనాధారం జీవో నెంబర్ 3 కొట్టివేసిన అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పార్టీలు తమకు అండగా నిలబడకపోగా చీకటి డ్రామాలు ఆడారని విమర్శించారు.

ప్రత్యేక ఎస్టీ కమిషన్ కోసం ఎన్ టి ఎఫ్ ఎన్నిసార్లు గత ప్రభుత్వం దృష్టికి తెచ్చిన పట్టించుకోలేదని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించేది కేవలం కాంగ్రెస్ పార్టీ నేనని అన్నారు. వీటన్నింటి నేపథ్యంలో తాము జిల్లా, మండల స్థాయిలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన తాము పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.



Next Story

Most Viewed