- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Hyderabad: పెట్రోల్ పోస్తుండగా నిప్పు.. తప్పిన పెను ప్రమాదం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నాచారంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. గంజాయి మత్తులో యువకులు చేసిన పనికి స్థానికులు బెంబేలెత్తిపోయారు. పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు అంటించారు. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటన మల్లాపూర్లోని ప్రైవేటు ఆయిల్ పెట్రోల్ బంక్లో జరిగింది. స్కూటీపై వచ్చిన ఆకతాయిలు పెట్రోల్ కోసం బంక్ వద్ద ఆపారు. పెట్రోల్ కొట్టాలని సిబ్బంది సూచించారు. దీంతో పెట్రోల్ కొడుతుండగా ఒక్కసారిగా జేబులోకి లైటర్ తీసి నిప్పు అంటించారు. దీంతో మంటలు చెలరేగాయి. అయితే నిప్పు పెట్టిన యువకులు గంజాయి మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది ఫిర్యాదుతో యువకులను నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story