మూసీ పరీవాహక ప్రాంతంలో నివాసముంటున్న వారిని గుర్తించేందుకు 16 బృందాలు

by Sridhar Babu |
మూసీ పరీవాహక ప్రాంతంలో నివాసముంటున్న వారిని గుర్తించేందుకు 16 బృందాలు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : మూసీ పరీవాహక ప్రాంతంలోని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తహసీల్దార్లను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు నిజమైన అర్హుల వివరాలు సేకరించాలని అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్​స్పెక్టర్లు, సర్వేయర్లు తదితరులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టినందున మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు 16 బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ఇందులో తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్, జీహెచ్ఎంసీ అధికారి, పోలీస్, ఆఫీస్ సబార్డినేట్ లు ఉంటారని చెప్పారు. ఒక్కొక్క బృందం మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న 75 గృహాలను సందర్శించి ఇంటి యజమాని, కిరాయిదారుని ఆధార్, వయస్సు, కులం, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ తదితర వివరాలు సేకరించాలని సూచించారు. సర్వే పారదర్శకంగా జరగాలని, ప్రతి రెండు బృందాలకు పర్యవేక్షణ అధికారిగా ఒక డిప్యూటీ కలెక్టర్ ను నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటాచారి, ఆర్డీఓ మహిపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ లు, ఆర్ ఐ లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed