HYD : డ్రగ్స్ దందాలో తండ్రీకొడుకు అరెస్ట్

by Rajesh |
HYD : డ్రగ్స్ దందాలో తండ్రీకొడుకు అరెస్ట్
X

దిశ, క్రైమ్ బ్యూరో : డ్రగ్స్ దందా చేస్తున్న తండ్రీ‌కొడుకును రాచకొండ పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సిద్ధిక్ షాకు 8 మంది సంతానం. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోవడంతో డ్రగ్స్ దందాకు శ్రీ కారం చుట్టాడు. తన కుమారుడు హనీఫ్‌షాతో కలిసి రాజస్థాన్‌కు చెందిన మొంటూ దగ్గర 100 గ్రాముల హెరాయిన్‌ను రూ.6 లక్షలకు కొనుగోలు చేశారు. దానిని రూ.12 లక్షలకు హైదరాబాద్‌లో విక్రయించేందుకు వచ్చారు. సమాచారం అందుకున్న రాచకొండ ఎస్ఓటీ పోలీసులు తండ్రి కొడుకులను అరెస్ట్ చేసి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.



Next Story

Most Viewed