కామారెడ్డిలో భారీగా నగదు పట్టివేత

by Disha Web Desk 12 |
కామారెడ్డిలో భారీగా నగదు పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ జరుగుతుండగా... ఈ రోజు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు నాలుగో దశలో మే 13న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోలింగ్‌కు సరిగ్గా రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో డబ్బు, మద్యం పంపిణీ పై ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తుండగా భారీగా నగదు పట్టుబడింది. ఐచర్ వాహనం లో తరలిస్తున్న నగదు దాదాపు రూ. 53.42 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ఈ నగదుకు సరైన ఆధారాలు, పత్రాలు చూపించకపోవడం తో పోలీసులు వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు.



Next Story

Most Viewed