Hot News: జన్వాడ ఫాంహౌస్‌పై నివేదిక సిద్ధం! కలెక్టర్‌కు అందించనున్న అధికారులు

by Shiva |
Hot News: జన్వాడ ఫాంహౌస్‌పై నివేదిక సిద్ధం! కలెక్టర్‌కు అందించనున్న అధికారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: శంకర్‌పల్లి మండలం జన్వాడలో నిర్మించిన ఫాంహౌస్ కూల్చివేతపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాన్ని హైడ్రా కూల్చివేస్తుందనే అనుమానంతో ప్రదీప్‌రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ భవన నిర్మాణంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయోనని చేవెళ్ల ఆర్డీవో పరిధిలోని రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్‌మెంటు ఆఫీసర్లు ఇటీవల ఫీల్డ్ సర్వే నిర్వహించారు. నాలా బఫర్‌జోన్‌లో జీ ప్లస్ వన్ కట్టినట్టు ఆఫీసర్ల స్టడీలో తేలింది. వరుసగా మూడు రోజుల పాటు అధ్యయనం చేసిన వివిధ శాఖల సిబ్బంది రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నారు. ఇందులో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నివేదిక ఆధారంగానే కూల్చివేతపై నిర్ణయం జరగనున్నది. దానికి అనుగుణంగా హైడ్రా తన కార్యాచరణను కొనసాగించనున్నది.

బుల్కాపూర్‌ నాలా బఫర్‌జోన్‌ పరిధిలో జన్వాడ ఫాంహౌస్ నిర్మాణమైందన్న అంచనా మేరకు రెవెన్యూ ఆఫీసర్లు ఇటీవల సర్వే నిర్వహించారు. ఎంత మేర నాలాను ఆక్రమించి కట్టారనే అంశాన్ని కూడా ఫీల్డ్ సర్వే ద్వారా తేల్చుకున్నారు. ఈ భవనాన్ని నిర్మించడానికి తీసుకున్న అనుమతులపైనా ఆరా తీశారు. చివరకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణమైనట్టు నిర్ధారణకు వచ్చారు. శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఈ భవనానికి అటు రెవెన్యూ శాఖ నుంచీ ఇటు పంచాయతీరాజ్‌ శాఖ నుంచీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మించినట్టు స్పష్టతకు వచ్చారు. ఇరిగేషన్ శాఖ నుంచి కూడా సిబ్బంది గ్రౌండ్ లెవల్‌లో సర్వే చేసి నాలా ఆక్రమణకు గురైనట్టు నిర్ధారణకు వచ్చారు. అప్పటి డాక్యుమెంట్లను కూడా సరిపోల్చి చూసుకున్నారు.

శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా స్టడీ

ఒకప్పుడు బుల్కాపూర్ నాలా ఎలా ఉండేది... దాని విస్తీర్ణం ఎంత... పరివాహక ప్రాంHot News: జన్వాడ ఫాంహౌస్‌పై నివేదిక సిద్ధం! కలెక్టర్‌కు అందించనున్న అధికారులుత పరిధి.. ఇప్పుడు ఏ మేరకు కుచించుకుపోయింది.. ఇలాంటి అంశాలన్నింటినీ ఉపగ్రహ చాయాచిత్రాల ఆధారంగా అధ్యయనం చేశారు. ప్రస్తుతం నిర్మాణమైన ఫాం‌హౌస్ మొత్తం విస్తీర్ణంలో ఎంత భాగం నాలా బఫర్‌జోన్‌ను ఆక్రమించిందనే అంశాన్ని కూడా లోతుగా స్టడీ చేశారు. ఏకకాలంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ల సిబ్బంది పరిశీలించారు. నిబంధనల ఉల్లంఘనపై ఈ మూడు శాఖల అధికారులు వెలిబుచ్చే అంశాలతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నివేదిక వెళ్లనున్నది. ఈలోపు గ్రామ పంచాయతీ నుంచి ఈ భవన నిర్మాణానికి జారీ అయిన అనుమతులు, ఇతర శాఖల నుంచి జారీ అయిన ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)లపైనా పూర్తి వివరాల సేకరణ కంప్లీట్ అయింది.

8 ఏళ్ల క్రితమే ఫాంహౌస్ కన్‌స్ట్రక్షన్

శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ గ్రామం మీర్జాగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఎనిమిదేండ్ల క్రితమే ఫాంహౌస్ నిర్మాణమైనట్టు తాజా సర్వేలో అధికారులకు వివరాలు అందాయి. గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ డిజైన్‌తో కట్టిన ఈ భవనానికి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేకపోవడంతో అప్పట్లోనే పంచాయతీ సెక్రెటరీ దీనిని అక్రమ కట్టడం అనే నిర్ధారణకు వచ్చారు. ఈ కారణంగానే ఫాంహౌస్ యజమాని ప్రసాదరాజుకు నోటీసులు జారీచేశారు. ఆయన నివాసానికి (జన్వాడ ఫామ్‌హౌజ్‌ కాదు) సైతం నోటీసులు పంపించారని తాజా సర్వేలో వెల్లడైంది. కానీ ఆ నోటీసులపై ప్రసాదరాజు నుంచి స్పందన లేకపోవడంతో ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో కొంతకాలం తర్వాత ఫాంహౌస్‌కు గ్రామ పంచాయతీ ఇంటి నంబర్‌ను కేటాయించిందని తేలింది. అప్పటి నుంచి ప్రతి ఏటా పంచాయతీకి ఆ భవనం నుంచి ట్యాక్స్ పేమెంట్ జరుగుతూ ఉన్నది.

కలెక్టర్ డెసిషన్ ఆధారంగా యాక్షన్ ప్లాన్

ఈ ఫాంహౌస్ (గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్) భవనం మొత్తం 362 చ.గ (దాదాపు 3250 చ.అ) విస్తీర్ణంలో ఉన్నట్టు అప్పటి జీపీ ఆఫీసర్లు తేల్చారు. ఈ లెక్కల ఆధారంగానే సంవత్సరానికి రూ. 11 వేల మేర పన్ను మదింపును ఫిక్స్ చేశారు. ఫాంహౌస్ కట్టిన ప్రాంతం ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉంటున్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణమైందని తెలిసినా అది మరో శాఖ పరిధి పర్యవేక్షణలో ఉంటుందనే అభిప్రాయంతో పన్ను వసూలుకు మాత్రమే గ్రామ పంచాయతీ పరిమితమైనట్టు రెవెన్యూ ఆఫీసర్లు తాజా సర్వేలో గుర్తించారు. వేర్వేరు శాఖల తాజా అధ్యయనం (సర్వే)తో వెల్లడైన వివరాలను నివేదికలో పొందుపర్చనున్నందున ఇక కూల్చివేతపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ నిర్ణయం ఆధారంగా హైడ్రా తదుపరి యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకోనున్నది.

Advertisement

Next Story

Most Viewed