నాగచైతన్య-శోభిత విడాకుల జ్యోతిష్యం.. మహిళా కమిషన్‌పై హైకోర్టు సీరియస్

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-28 14:50:56.0  )
నాగచైతన్య-శోభిత విడాకుల జ్యోతిష్యం.. మహిళా కమిషన్‌పై హైకోర్టు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ఫిలిం జర్నలిస్టులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. నాగచైతన్య, శోభితలపై ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిలిం జర్నలిస్టులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో వేణుస్వామికి మహిళా కమిషన్ ఫిర్యాదు చేసింది. ఆ నోటీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. నాగచైతన్య శోభితలకు లేని సమస్య మీకెందుకు? అని ఫిలిం జర్నలిస్టులను ప్రశ్నించింది. వారు ఇచ్చిన ఫిర్యాదులపై మీరెలా నోటీసులు ఇస్తారని స్టేట్ మహిళా కమిషన్‌కూ హైకోర్టు మొట్టికాయలు వేసింది.

Advertisement

Next Story