Eatala Rajendar : భారీగా ట్రాఫిక్.. మెట్రోలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రయాణం

by Ramesh N |
Eatala Rajendar : భారీగా ట్రాఫిక్.. మెట్రోలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రయాణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఓ సామాన్యుడిగా మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. నిన్న ఎల్బీనగర్ నియోజకవర్గంలో, పలు కార్యక్రమాలకు హాజరు కావడం కోసం.. మూసాపేట్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రయాణించారు.

రోడ్డు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఉండటంతో ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రయాణికులతో ఆయన సరదాగా ముచ్చటించారు. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇతర ప్రాంతాలకు కూడా మెట్రో విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఈటలను కోరారు. అదేవిధంగా మెట్రోలో ఈటల ప్రయాణించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story