Harish Rao: తెలంగాణ భవన్‌లో హరీష్ రావు ప్రెస్ మీట్

by Anjali |   ( Updated:2024-09-08 09:41:04.0  )
Harish Rao: తెలంగాణ భవన్‌లో హరీష్ రావు ప్రెస్ మీట్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు నేడు హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని అన్నారు. కాంగ్రెస్ పూటకో మాట మాట్లాడుతోందని విరుచుపడ్డారు. 9 నెలల్లో 475 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ కాలేదన్న బాధతోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయని చెప్పారు. రుణమాఫీ జరిగిందని రేవంత్ గొప్పలు చెప్పుకుంటున్నారని, రుణమాఫీ జరిగితే రైతులు ఎందుకు0 ఆత్మహత్యలు చేసుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కుటుంబ బంధాలు తెగిపోతున్నాయని, కాంగ్రెస్ మాటలకు, చేతలకు పొంతన లేదని, రేషన్‌కార్డుతో సంబంధంలేకుండా రుణమాఫీ చేస్తామన్నారని తెలిపారు. సురేందర్‌రెడ్డిది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య.. రైతులను ప్రభుత్వం దగా చేస్తోందని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేడ్చల్ లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు లేఖ రాసి మరీ సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని, ఆయనకు apgvb లో అప్పు ఉందని, సురేందర్ రెడ్డి అమ్మకు లక్షా 15 వేలు, సురేందర్ రెడ్డికి లక్షా 92 వేలు అప్పు ఉందని తెలిపారు. బ్యాంకు మేనేజర్ అనిరుద్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరికే రుణమాఫీ అవుతుందని చెప్పడంతో సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. సురేందర్ రెడ్డి ఆత్మహత్య లేఖలోని ప్రతి అక్షరం రేవంత్ రెడ్డిని నగ్న స్వరూపాన్ని బయటపెట్టిందని హరీష్ రావు అన్నారు. రైతు రుణమాఫీ ఆంక్షలతో రేవంత్ కుటుంబ బంధాల్లో చిచ్చు పెట్టారని అన్నారు. కేసీఆర్ కుటుంబ బంధాలు బలోపేతం చేస్తే వాటిని విచ్చిన్నం చేసిన దరిద్రపు గొట్టు ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.

నా నియోజకవర్గంలో జక్కాపూర్ గ్రామంలో గురజాల బాల్ రెడ్డి కుటుంబంలో ముగ్గురికి రుణం ఉందని, వారికి ఆరు లక్షల అప్పు ఉంటే, కేవలం రెండు లక్షలే మాఫీ అవుతోందని అన్నారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని అన్నారు. .ఇది రైతుల పాలిట రేవంత్ చేసిన మోసం, దగా కాదా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి రేవంత్ ప్రభుత్వం 31 సాకులు చూపెడుతోందని తెలిపారు. నారాయణ్ పేట గ్రామంలో నల్ల మణెమ్మ అనే రైతుకు లక్ష రూపాయల అప్పు ఉందని, ఆమె భర్త 2010 లో మరణించారని గుర్తు చేశారు. ఆయన ఆధార్ కార్డు తెస్తేనే రుణ మాఫీ చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారని, 2010 లో ఆధార్ కార్డే ఇవ్వనప్పుడు ఆధార్ కార్డు ఎలా తెస్తారన్నారు. కుంభాల సిద్ధారెడ్డి, చాట్ల హరీష్ అనే రైతులకు భార్యల ఆధార్ కార్డులు తెమ్మంటున్నారు. వారికి పెళ్లిళ్లే కాలేవు. ఆధార్ కార్డులు ఎక్కడ్నుంచి తెస్తారని ప్రశ్నించారు.

ఇలాంటి వాళ్ళు ఎంత మందో ఉన్నారని, రుణమాఫీ కోసం వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవాలా? అన్నారు. 20 లక్షల మందికే ఇప్పటిదాకా రుణమాఫి అయ్యిందని, 21 లక్షల రైతుల మందికి ఇంకా కావాలన్నారు. కాంగ్రెస్ అంటే కోతలు అన్నట్టుగా తయారైందని హరీష్ రావు సెటైర్లు వేశారు. ఎన్నికలప్పుడు కట్టు కథలు చెప్పారని అన్నారు. చేతి గుర్తుకు ఓటేస్తే కోతలే మిగిలాయని ఎద్దేవా చేశారు. సురేందర్ రెడ్డిని చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం

Advertisement

Next Story

Most Viewed