వాళ్లు మళ్లీ కేసీఆర్‌ను గుర్తుచేసుకునే పరిస్థితి వచ్చింది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 9 |
వాళ్లు మళ్లీ కేసీఆర్‌ను గుర్తుచేసుకునే పరిస్థితి వచ్చింది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం హరీష్ రావు మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 5 నెలల్లోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా? అని బాధపడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు ‘వద్దు రా నాయనా ఈ కాంగ్రెస్ పాలన’ అంటున్నారని కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ పాలనపై ఎద్దేవా చేశారు. ఇవాళ రైతులు, మహిళలు, పెన్షన్ దారులు తిరిగి కేసీఆర్‌ను గుర్తు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని హరీష్ రావు సంచలన సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనేక స్థానాల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని విమర్శించారు.

Next Story

Most Viewed