CM Revanth Reddy: సీఎం సహాయనిధికి ఏఎంఆర్ ఇండియా, వోక్స్ సెన్ విరాళం

by Prasad Jukanti |   ( Updated:2024-09-13 07:00:53.0  )
CM Revanth Reddy: సీఎం సహాయనిధికి ఏఎంఆర్ ఇండియా, వోక్స్ సెన్ విరాళం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరద బాధితుల సహాయార్థం పలు సంస్థలు, కంపెనీలు మానవత్వంతో ముందుకు వస్తున్నాయి. తాజాగా శుక్రవారం పలు సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల చెక్కులు అందజేశారు. ఏఏంఆర్ ఇండియా కంపెనీ సీఎంఆర్ ఎఫ్ కు రూ.ఒక కోటి విరాళం అందించింది. ఈ మేరకు కంపెనీ ఎండీ ఎ.మహేశ్ కుమార్ రెడ్డి సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందజేశారు. అలాగే వాక్సన్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు కె. ప్రవీణ్ పూల సీఎంకు రూ.50 లక్షల చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళాలు అందించిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed