Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

by M.Rajitha |
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం మెట్రో ప్రయాణికులకు అందిస్తున్న అన్ని రకాల ఆఫర్లను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు అందిస్తున్న ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. సూపర్ సేవర్-59,( Super Saver 59 Rupees Holiday Metro Card ) స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ( Super OFF PEAK Offer ) వంటి ఆఫర్లు వచ్చే ఏడాది మార్చి వరకు ఎక్స్టెండ్ పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో అక్టోబర్ 6 నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేయనున్నట్టు కూడా ఈ ప్రకటనలో మెట్రో సంస్థ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed