కే.కేశవరావుకు కేబినెట్ హోదా కల్పిస్తూ.. కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు!

by Ramesh Goud |
కే.కేశవరావుకు కేబినెట్ హోదా కల్పిస్తూ.. కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ నాయకుడు కే.కేశవరావు నియాకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నాయకుడు కె.కేశవరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఆయనకు కాంగ్రెస్ సర్కారు కేబినెట్ హోదాను కల్పించింది. ప్రజా సంబంధాల శాఖలో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా తెలంగాణ రాష్ట్రం రాక ముందు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్న కేకే రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడుగానే కాక పార్టీలో పలు కీలక పదవులు అనుభవించారు. కేసీఆర్ విధివిదానాలతో పొసగక ఆ పార్టీకి రాజీనామా చేసి.. ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురి నాయకులను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేం నరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారుగా, షబ్బీర్ అలీని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు సలహాదారుగా నియమించంగా.. హర్కరా వేణుగోపాల్ ను ప్రోటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాకు చెందిన డా.మల్లు రవిని రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించగా.. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిచి ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవిలో అదే జిల్లాకు చెందిన ఏ.పీ.జితేందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా బీజేపీ పార్టీలో ఉన్న జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి టికెట్ ఆశించి బంగపడ్డారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement

Next Story

Most Viewed