పేద గిరిజన విద్యార్థి సాయం చేసిన మాజీ తానా అధ్యక్షుడు..

by Vinod kumar |   ( Updated:2023-08-15 16:41:01.0  )
పేద గిరిజన విద్యార్థి సాయం చేసిన మాజీ తానా అధ్యక్షుడు..
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామానికి చెందిన పేద గిరిజన విద్యార్థి.. గడ్డం యువరాజ్ ఇంటర్‌లో సత్తాచాటాడు. 92 శాతం మార్కులతో పాస్ అయ్యాడు. అల్ ఇండియా పరీక్షలు JEE ఎంట్రన్స్ రాయగా.. IITDM KANCHIPURAM లో సీట్ వచ్చింది. కోర్స్ కాల పరిమితి 5 సంవత్సరాలు.. అయితే విలువైన విద్యను అభ్యసించడానికి ఎంతో ఆశ ఉన్న పేదరికం అడ్డువచ్చింది.

ఈ క్రమంలో ITDA కార్యలయంలో ఉన్నత విద్య కోసం ఆర్ధిక సహాయాన్ని అర్ధించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో మాజీ తానా అధ్యక్షుడు, SIGMAINC PROFESIONAL SERVICE PRIVATE LTD అధినేత (NRI) నన్నపనేని మోహన్.. గడ్డం యువరాజ్‌కి ఆర్ధిక సాయం చేశారు. మొదటి విడతగా ₹75000/- రూపాయల అమెరికా నుండి పంపారు. నన్నపనే మోహన్.. యువరాజ్‌కి ఆర్ధికంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed