చిందేసిన రాజయ్య.. రీ ఎంట్రీ జోష్ మామూలుగా లేదుగా!

by Disha Web Desk 14 |
చిందేసిన రాజయ్య.. రీ ఎంట్రీ జోష్ మామూలుగా లేదుగా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ వరంగల్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. కీలక నేత కడియం శ్రీహరి పార్టీ మారడం, ఆయన కుమార్తె కావ్యకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ టికెట్ కన్ఫామ్ చేసిన తర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్లి పార్టీ పరువు తీశారనే ఉద్దేశంతో గులాబీ నేతలు కడియంపై ఫైర్ అవుతున్నారు. ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కుతూ కడియం కావ్యను ఓడగొట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రీ ఎంట్రీ ఇచ్చారు. వరంగల్ జిల్లాలో ఆయనకు పట్టు ఉండటంతో ప్రచార బాధ్యతలు అప్పగించారు.

Next Story

Most Viewed