ఆ రెండు అంశాలపై ఫోకస్.. బీజేఎల్పీ కీలక భేటీ

by Rajesh |   ( Updated:2024-07-12 05:29:45.0  )
ఆ రెండు అంశాలపై ఫోకస్.. బీజేఎల్పీ కీలక భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎల్పీ కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భేటీలో చర్చించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై సైతం ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సర్కారును ఎలా ఇరుకున పెట్టాలనే అంశంపై చర్చించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్‌పై ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, రైతు రుణమాఫీ, రైతు పంట సాయం, నిరుద్యోగ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వ్యూహం వేశారు. కాగా అసెంబ్లీ ఎల్పీ ఆఫీసులో నిర్వహించిన ఈ భేటీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బైక్ పై వచ్చి సందడి చేశారు.

Advertisement

Next Story

Most Viewed