రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన బలి దేవత ఎవరు? ఎక్స్‌లో కేటీఆర్ సంచలన ప్రశ్న! నెటిజన్స్ జవాబు ఎంటో తెలుసా?

by Ramesh N |   ( Updated:2024-05-31 07:10:59.0  )
రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన బలి దేవత ఎవరు? ఎక్స్‌లో కేటీఆర్ సంచలన ప్రశ్న! నెటిజన్స్ జవాబు ఎంటో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆయన ఎక్స్ వేదికగా సంచలన ప్రశ్నలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమరుల స్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల? అని ప్రశ్నించారు. 1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం.. అని పేర్కొన్నారు.

1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11/14 సీట్లలో తెలంగాణ ప్రజా సమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు ? కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, 2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు ? కాంగ్రెస్ ప్రభుత్వం.. అంటూ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు? అని నెటిజన్లు సమాధానం చెప్పాలని కోరారు.

వెళ్లి కాళ్ళు పట్టుకుని వచ్చారు కదా.. ఆమెనా సర్ : నెటిజన్ల విమర్శలు

ఈ క్రమంలోనే గన్‌పార్క్ అమరవీరుల స్థూపం ఫోటోను కేటీఆర్ పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ట్వీట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలి దేవత సోనియా గాంధీ అని బీఆర్ఎస్ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. 1983లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి పదవులు అనుభవించిన మాజీ సీఎం కేసీఆర్ చేప్పాలి సమాధానం ప్రజలకి అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘వెళ్లి కాళ్ళు పట్టుకుని వచ్చారు కదా.. ఆమెనా సర్’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో కేసీఆర్ ఫ్యామిలీ దిగిన ఫోటోను మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరి ఫ్యామిలీ మొత్తం పోయి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తో ఫోటో ఎందుకు దిగారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed