టచ్‌లో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు.. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు ఈటల కౌంటర్

by Disha Web Desk 4 |
టచ్‌లో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు.. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు ఈటల కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ నేత ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ తో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదన్నారు. 60 మంది ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదన్నారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ ప్రభుత్వం నాయకులను కొనుగోలు చేస్తోందన్నారు. మల్కాజ్‌గిరిలో ప్రధాని మోడీ రోడ్డు షో తర్వాత బీజేపీకి మద్దతు పెరిగిందన్నారు. అన్ని రంగాలు, వర్గాల ప్రజలు మోడీ మరో సారి ప్రధాని కావాలనుకుంటున్నారని తెలిపారు.


Next Story

Most Viewed