రెచ్చిపోతున్న ‘రియ‌ల్’ మాఫియా.. కంటి తుడుపు చర్యలుగా కూల్చివేతలు

by Gantepaka Srikanth |
రెచ్చిపోతున్న ‘రియ‌ల్’ మాఫియా.. కంటి తుడుపు చర్యలుగా కూల్చివేతలు
X

దిశ, గండిపేట్: గండిపేట్ మండల పరిధిలో దేవాదాయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎకరాలకు ఎకరాలు భూములు మాయం అవుతున్నా అధికారులకు మాత్రం కనిపించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. గండిపేట్ మండల పరిధిలోని మణికొండ మున్సిపాలిటీలో దేవాదాయ భూమి ఆక్రమణకు గురైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపురి తుల్జారాం దేవాలయం సమీపంలో సర్వే నంబర్లు 116, 112, 125లలో అక్రమ నిర్మాణాలు యథే చ్ఛగా కొనసాగుతున్నాయి. అధికారు లు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

మున్సిపాలిటీలో ఈ దేవాలయానికి సంబంధించి 28 ఎకరాల 24 గంటల భూమి ఉండగా.. ప్రస్తుతం ఐదెకరాలకే పరిమితమైందని స్థానికులు చెబుతున్నారు. అయినా దేవాదాయ, రెవెన్యూ శా ఖల అధికారులు కళ్లు మూసుకొని ఈ నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నారు. మరి దేవాదాయ శాఖ భూములు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏకంగా 28.24 ఎకరాల భూమి ఉం డగా అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టి ఐదు ఐదు ఎకరాలకే పరిమితం చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నా రు. మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్‌, విద్యు త్‌శాఖ అధికారుల స‌హ‌కారంతోనే ఈ అక్రమ నిర్మాణాలు కొన‌సాగుతున్నట్లు స్థానికులు మండిప‌డుతున్నారు. ఇప్పటికైనా మణికొండ మున్సిపాలిటీ పరి ధిలో దేవాదాయ భూముల ఆక్రమణ అడ్డుకొని తిరిగి దేవాలయానికి ఇప్పించాలని ప్రజలు కోరుతున్నారు.

కొన్ని నిర్మాణాలు కూల్చేసి.. మరికొన్ని వదిలేసి..

మణికొండ మున్సిపాలిటీలో చేపట్టే అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు కంటి తుడుపు చర్యలకు పా ల్పడుతున్నారని స్థానికులు అంటున్నా రు. సర్వే నంబర్ 116, 112, 125 నిర్మాణాలు చేపడితే 116 లోని నిర్మాణాలను కూల్చివేసి మిగిలిన సర్వే నంబర్లలో వదిలేశారని ఆరోపణలను స్థానికులు వినిపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

చర్యలు తీసుకోవడంలో విఫలం..

దేవాదాయ శాఖ చెందిన భూములని తెలిసినప్పటికీ ఇక్కడ అనేకమంది కబ్జాదారులు భూములు ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ నిర్మాణాలపై జాగ్రత్త వహించాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు తమకు వచ్చిన విధంగా నిర్మాణాలు చేపట్టి వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు మాత్రం ఈ అంశంపై నోరు మెదపకపోవడం సర్వత్రా పలు అనుమానాలకు తావిస్తుందని స్థానికులు అంటున్నారు.

నోటీసులు ఇచ్చాం: అరుణ‌కుమారి, ఈవో

దేవాదాయ శాఖ‌కు చెందిన భూముల రిజిస్ట్రేష‌న్లు చేయ‌ వ‌ద్దని అధికారుల‌కు తెలిపాం. అయితే నిర్మాణాలు చేప‌డుతున్న వారికి నోటీసులు సైతం ఇచ్చాం. దేవాదాయ శాఖ‌కు చెందిన భూముల్లో నిర్మాణాల‌కు మున్సిప‌ల్ అధికారులు, విద్యుత్ అధికారులు స‌హ‌క‌రి స్తున్నార‌ని ఈ మేర‌కు ఆయా శాఖ‌ల అధికారుల‌తో చ‌ర్చిస్తున్నాం. దేవాదాయ భూముల్లో ఆక్రమ‌ణ‌లు చేసిన నిర్మాణాలపై సెప్టెంబ‌ర్ 6న ఉత్తర్వులు జారీ అవుతాయి. ఈ భూ ముల‌కు సంబంధించి స‌ర్వే చేయించుకోకుండా కాల‌యాప‌న చేస్తున్నారు. దేవాల‌య భూముల‌ను నొక్కాల‌నే ఉద్దేశంతో క‌బ్జాదారులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. గండిపేట్‌‌కు స‌ర్వేయ‌ర్ వ‌చ్చాక స‌ర్వే చేయిస్తాం.

Advertisement

Next Story

Most Viewed