డీఎస్ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు: డిప్యూటీ CM భట్టి

by Anjali |   ( Updated:2024-06-29 12:13:26.0  )
Bhatti Vikramarka
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమై.. నేడు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా డీఎస్ మరణం పట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మరణం కాంగ్రెస్ కు తీరని లోటని అన్నారు. ఆయన సేవలు మరవలేనివని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేసుకున్నారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని కోరుకుంటున్నానని తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక ధర్మపురి శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్ గా పని చేశారు. ఇక రెండో కుమారుడైన ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed