Telangana DGP: నగరంలో 40 శాతం నిమజ్జనం పూర్తి

by Gantepaka Srikanth |
Telangana DGP: నగరంలో 40 శాతం నిమజ్జనం పూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని నిమజ్జనాలపై డీజీపీ జితేందర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు 40 శాతం నిమజ్జనం పూర్తయిందని తెలిపారు. రేపు కూడా నిమజ్జనం కొనసాగుతుందని అన్నారు. వర్కింగ్‌ డే కాబట్టి ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని డీజీపీ తెలిపారు. 19న మిలాద్ ఉన్ నబీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పాతబస్తీలోనూ నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని చెప్పుకొచ్చారు. సహకరిస్తున్న ప్రజలకు డీజీపీ జితేందర్‌ ధన్యవాదాలు చెప్పారు. హైదరాబాద్‌లో మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్‌ ఏర్పాటు చేశారు. ట్యాంక్‌ బండ్‌ దగ్గర 8 చోట్ల పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. గణేష్‌ నిమజ్జనాల దృష్ట్యా మెట్రో సమయాలు పొడిగించారు. ఇవాళ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. మహిళల రక్షణ కోసం హుస్సేన్‌ సాగర్‌ పరిసరాల్లో 12 షీ టీమ్స్‌ రంగంలోకి దిగాయి.

Advertisement

Next Story

Most Viewed