దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 1 |
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మతతత్వ శక్తులను తరిమికొట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ భవన్‌లో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరిన జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ చేరారు. ఆయనకు సీఎం కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మతతత్వ బీజేపీ పార్టీ విధానాల వల్ల దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దాన్ని రక్షించాల్సిన బాధ్యత బడుగు బలహీనవర్గాలు, ప్రజాస్వామ్యవాదులు, కుల సంఘాలు అందరూ మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, టీపీసీసీ కార్యదర్శి మాదు సత్యం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed