Delhi Tour: బీఆర్ఎస్ నేతలు హస్తిన బాట..! నేడు కవిత బెయిల్‌పై విచారణ

by Shiva |   ( Updated:2024-08-27 15:53:29.0  )
Delhi Tour: బీఆర్ఎస్ నేతలు హస్తిన బాట..! నేడు కవిత బెయిల్‌పై విచారణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరెస్టు అయిన ఎమ్మెల్సీ క‌విత‌ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు. ఆమె బెయిల్ పిటిష‌న్‌పై నేడు సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఆమె త‌ర‌ఫున ప్రముఖ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించ‌నున్నారు. ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే న‌మ్మకం బీఆర్ఎస్ నాయ‌క‌త్వంలో ఉన్నది. దీంతో బీఆర్ఎస్ నేతలంతా ఢిల్లీ బాట పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రమే కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొంత మంది సోమవారం వెళ్లగా, ఇంకొంత మంది మహిళా నేతలు, సీనియర్లు, ఎమ్మెల్యేలు మంగళవారం వెల్లనున్నట్టు సమాచారం. బెయిల్‌పై కవిత విడుదల కాగానే ఆమెకు స్వాగతం పలికేందుకు వీరంతా వెళ్లినట్లు తెలిసింది.

ధైర్యం కల్పించేందుకే..

పార్టీ కార్యకర్తకు, నాయకుడికి ఎవరికి ఏ ఆపద వచ్చినా పార్టీ అండగా ఉంటుందని చాటేందుకే సీనియర్ నేతలంతా ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. కవితలో మనోధైర్యం కల్పించడం, తామంతా అండగా ఉన్నామని చాటేందుకే అందరూ అక్కడికి వెళ్లినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం దూకుడుతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. అక్రమాలను వెలికితీసే పనిలో ప్రభుత్వం నిమగ్నం కావడంతో ఏ నాయకుడు ఎప్పుడు చేజారుతారోనని గులాబీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. ఎవరూ పార్టీని వీడకుండా కాపాడుకోవడంతో పాటు ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పేందుకు ఢిల్లీ ప్రోగ్రామ్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తున్నది.

ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్లని కేసీఆర్

మద్యం కేసులో ఎమ్మెల్సీ క‌విత మార్చి 15వ తేదీ నుంచి తిహార్ జైలులో ఉంటున్నారు. జైలులో ఉండDelhi Tour: బీఆర్ఎస్ నేతలు హస్తిన బాట..! నేడు కవిత బెయిల్‌పై విచారణగానే జూలై 16న, ఆగస్టు 22న ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్యం చేయించారు. అయినా పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు కవితను పరామర్శించలేదు. కేవలం కేటీఆర్, హరీశ్‌రావును మాత్రమే పంపించి జరిగిన విషయాలు తెలుసుకుంటున్నారు. కోర్టులో వాదనలు, బెయిల్ పిటిషన్లు, జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. అయితే నేడు కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఉండటం, ఇదే కేసులో మనిష్ సిసోడియాకు బెయిల్ రావడంతో కవితకు సైతం వస్తుందనే ఆశతో గులాబీ నేతలు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed