Asaduddin Owaisi : చంపుతామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్.. : అసదుద్దీన్ ఒవైసీ

by Rajesh |
Asaduddin Owaisi : చంపుతామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్.. : అసదుద్దీన్ ఒవైసీ
X

దిశ, వెబ్‌డెస్క్: తనను చంపుతామంటూ ఫోన్ కాల్స్, మేసేజ్‌లు వస్తున్నాయని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ముస్లింలపై ద్వేషం పెంచుకుందన్నారు. అస్సాంలో ముస్లింల జనాభా 40 శాతం దాటిందంటూ సీఎం హిమంత బిశ్వ శర్మ అంటున్నారని వాస్తవానికి అక్కడ 34 శాతం మాత్రమే ముస్లిం జనాభా ఉందన్నారు. ముస్లింలు, దళితులు, బలహీన వర్గాల గొంతక అయి వారి సమస్యలు వినిపిస్తుంటే తనపై కక్ష సాధింపు చర్యలకు దిగడం ఏంటని ప్రశ్నించారు. గతంలో యూపీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్తుండగా ఆరు రౌండ్ల కాల్పులు జరిపారని.. ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదన్నారు. బీజేపీ రూలింగ్‌లో ఉన్న రాష్ట్రాల్లో ప్లాన్ ప్రకారం ముస్లింలను అణచివేసే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని అసద్ ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed