10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు: దానం నాగేందర్

by karthikeya |
10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు: దానం నాగేందర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ పార్టీ త్వరలో కనుమరుగు కాబోతోందని, అతి త్వరలో ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, అయితే తాము పార్టీ మారడంపై పెట్టిన కేసును చూపెట్టి వారిని బీఆర్ఎస్ అధిష్ఠానం భయపెడుతోందని ఆరోపించారు. అందుకే వాళ్లు పార్టీ మారకుండా ఆగుతున్నారని, కానీ ఆలస్యమైనా కాంగ్రెస్‌లో ఆ ఎమ్మెల్యేల చేరిక కచ్చితంగా ఉంటుందని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. తమ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవప్రదంగా ఉండే హరీష్ రావు (Haresh Rao) కూడా గాడి తప్పారని, బీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టి నోటికొచ్చినట్లు మాట్లాడేలా ప్రేరేపిస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళానని ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలపై కూడా దానం నాగేందర్ ఈ రోజు (ఆదివారం) ఉదయం షాకింగ్ కామెంట్స్ చేశారు. పేదల ఇళ్లను కూల్చడం సరికాదని, ఇళ్లు కూల్చిన చోటే వాళ్లందరికీ ఇళ్లు కట్ఠివ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని బాధితులకు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed