బీఆర్ఎస్ విజయాలను తమ ఘనతగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి హరీష్ రావు

by M.Rajitha |
బీఆర్ఎస్ విజయాలను తమ ఘనతగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ పాలనలోనే ఎంఎస్ఎంఈ‌లు ఎంతో అభివృద్ధి చెందాయని, దేశానికి ఆదర్శంగా నిలిచాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డా.. తెలంగాణలో అనుసరించిన ఐపాస్ లాంటి విధానాలు ఎంఎస్ఎంఈలను దృఢంగా నిలిపాయన్నారు. పెట్టుబడుల్లో 115 శాతం పెరుగుదలతో దేశంలో అగ్రగామిగా నిలవడమే కాక.. ఉద్యోగాల కల్పనలో 20 శాతం వృద్ధిరేటు సాధించిందన్నారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు 30 శాతం ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ పాలనలో సాధించిన ఘనతను వారి ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఎంఎస్ఎంఈ అభివృద్ధికి తాము చేసిన కృషి ఏంటో భవిష్యత్తు కార్యాచరణ ఏంటో చెప్పకుండా గత ప్రభుత్వ విజయాలతో కాలం గడపడం శోచనీయం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed