‘హిట్లర్ కేబినెట్‌లో గోబెల్.. మోడీ కేబినెట్‌లో కిషన్ రెడ్డి’

by GSrikanth |
‘హిట్లర్ కేబినెట్‌లో గోబెల్.. మోడీ కేబినెట్‌లో కిషన్ రెడ్డి’
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి సోది చెప్పే స్థాయికి వెళ్లారని విమర్శించారు. హిట్లర్ కేబినెట్‌లో గోబెల్ ఉన్నట్లే.. మోడీ కేబినెట్‌లో కిషన్ రెడ్డి ఉన్నారని అన్నారు. రోజూ మోడీ చెప్పే అబద్ధాలనే కిషన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15లోపే రైతు రుణమాఫీ రూ.2 లక్షలు చేస్తానని సీఎం రేవంత్ చెప్పారని గుర్తుచేశారు. దానికి కట్టుబడి ఉన్నట్లు కూడా చెప్పారు. తమపై రైతులకు నమ్మకం ఉందని అన్నారు.

తమకే కాదు.. బీజేపీ నాయకులకు కూడా ఉందని.. అందుకే ఎక్కడ చేస్తామో అనే భయంతో.. చేయరు.. చేయలేరు.. అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని.. ఆ సంగతి బీజేపీకి తెలియదా? అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. మరోసారి బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతోందని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు దేశం మొత్తం సిద్ధంగా ఉందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed