రూ.2 లక్షల రుణమాఫీపై బ్యాంకర్లతో సీఎం రేవంత్ కీలక సమావేశం

by Satheesh |
రూ.2 లక్షల రుణమాఫీపై బ్యాంకర్లతో సీఎం రేవంత్ కీలక సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: రూ.2 లక్షల రుణమాఫీ స్కీమ్ ప్రారంభం నేపథ్యంలో రేపు (గురువారం) రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రజాభవన్ వేదికగా సీఎం రేవంత్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్‌కి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, తదితరులు హాజరుకానున్నారు. రుణమాఫీ ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 18వ తేదీన లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ అమలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై సీఎం రేవంత్ అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. మొదటి విడతలో లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో అన్ని మండల కేంద్రాలలో ఉన్న రైతు వేదికల్లో రైతుల సంబరాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులనుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed