- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గజ్వేల్ గడ్డపై ‘దళిత - గిరిజన దండోరా’ గుర్తుకొచ్చింది.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

దిశ, డైనమిక్ బ్యూరో: గజ్వేల్ నియోజకవర్గం నుంచి నర్సారెడ్డి సారథ్యంలో వందలాది మంది పాదయాత్రగా వచ్చి కలిశారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. పాదయాత్రకు వచ్చే ప్రజలను చూస్తే ఆ నాడు గజ్వేల్ గడ్డపై చేసిన “దళిత - గిరిజన దండోరా” గుర్తుకు వచ్చిందని పేర్కొన్నారు. తమ శాసన సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాసన సభకు హాజరు కాకపోవడం వల్ల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యలు సభలో ప్రస్తావనకు రాని పరిస్థితిపై ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పట్ల నర్సారెడ్డి బాధతో, బాధ్యతతో వ్యవహరిస్తున్న తీరు అభినందనీయమన్నారు. గజ్వేల్ పట్ల నాకు ప్రత్యేక అభిమానం ఉంది.. ఆ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం అభివృద్ధి విషయంలో ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కాగా, బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం, నియోజకవర్గానికి సైతం రావడం లేదని గజ్వేల్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నుంచి రాజ్భవన్ వరకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీకి హాజరుకాని గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా రాజ్భవన్ వెళ్లి గవర్నర్కు వినతిపత్రం అందించారు.