రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

by karthikeya |
రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ కొడంగల్ (బొంరాస్ పేట్): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రేపు (ఆదివారం)కొడంగల్‌కు రానున్నట్లు వ్యక్తిగత సహాయకుడు సైదులు తెలిపారు. ప్రతి సంవత్సరం విజయదశమి మరసటి రోజు రేవంత్ రెడ్డి కోడంగల్‌కు రావడం ఆనవాయితీగా వస్తుంది. దీనిలో భాగంగానే ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ప్రజలను, కార్యకర్తలను ఆయన కలవనున్నారు.

కాగా.. కొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డి పల్లికి చేరుకోనున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వగ్రామంలో అడుగుపెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి. స్వగ్రామంలో జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం గ్రామంలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేసి స్థానిక నేతలతో మంతనాలు జరపనున్నారు.

Advertisement

Next Story

Most Viewed