గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

by Rajesh |
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు. ఏపీతో ఉమ్మడి సమస్యలపై గవర్నర్‌ సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఈనెల జూన్ 2 తో ఏపీకి హైదరాబాద్‌పై ఉమ్మడి రాజధాని హక్కులు ముగిశాయి. పదేళ్లుగా ఇంకా పెండింగ్‌లో ఏపీతో ఉమ్మడి ఆస్తులు, అప్పుల వ్యవహారం నడుస్తోంది. మొన్న ఏపీ సీఎం చంద్రబాబును గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కలిసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం రూపొందించనున్న కొన్ని బిల్లులపై రేవంత్ గవర్నర్‌తో చర్చించనున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ టూర్, విభజన హామీలు, కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed