CM Revanth Reddy: రాష్ట్రానికి మరో బడా సంస్థ.. ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ తో సీఎం భేటీ

by Prasad Jukanti |
CM Revanth Reddy: రాష్ట్రానికి మరో బడా సంస్థ.. ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ తో సీఎం భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సౌత్ కొరియాలో బిజీ బిజీగా గడుపుతున్నది. అమెరికా పర్యటనను విజయవంతంగా ముంగించుకుని దక్షిణ కోరియా చేరుకున్న ముఖ్యమంత్రి బృందం ఇవాళ సియోల్ లో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక సమ్మేళనాలలో ఒకటైన ఎల్ఎస్ కార్ప్(గతంలో ఎల్ జీ గ్రూప్ లో భాగస్వామి) చైర్మన్ కూ జా యన్ తో పాటు ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ కేబుల్, గ్యాస్, ఇంధన, బ్యాటరీల ఉత్పత్తిలో పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించేందుకు సముఖత వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో ఎల్ ఎస్ గ్రూప్ ను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు లాంఛనంగా స్వాగతిస్తున్నట్టు ఈ మేరకు సీఎంవో సోమవారం ఉదయం ట్వీట్ చేసింది.

టెక్స్ టైల్ పార్క్ ఇన్వెస్ట్ మెంట్స్ కోసం టాస్క్ ఫోర్స్:

కొరియా పెడరేషన్ ఆఫ్ టెక్స్ టైల్ ఇండస్ట్రీ (కేఓఎఫ్ఓటీఐ)నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం హాజరైంది. ఈ సందర్భంగా వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ లో పెట్టుబడులకు అనువైన గమ్యస్థానం అని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం ఆహ్వానించారు. సీఎం ఆహ్వానంపై యంగ్ గోన్ చైర్మన్ కిహాక్ సంగ్, కేఓఎఫ్ఓటీఐ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సోయంగ్ జూ తో పాటు 25 ప్రధానమైన టెక్స్ టైల్ కంపెనీలకు చెందిన అగ్ర నాయకులు ఉత్సాహంతో ప్రతిస్పందించారు. ఈ సమావేశంతో టెక్స్ టైల్ రంగంలో వరంగల్ తో పాటు తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలకు మరిన్ని పెట్టుబడులు ఆకర్శిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు వేగవంతంగా తీసుకునేలా మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు కలిసి ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు సీఎంవో ట్వీట్ లో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed