‘ఇప్పుడు నా ముందున్న ఏకైక లక్ష్యం అదే’.. మనసులో మాట బయటపెట్టిన CM రేవంత్

by Satheesh |
‘ఇప్పుడు నా ముందున్న ఏకైక లక్ష్యం అదే’.. మనసులో మాట బయటపెట్టిన CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్.. గురువారం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను అధికారం నుండి గద్దె దించాలనే నా జీవిత లక్ష్యం ఎట్టకేలకు నెరవేరిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను అధికారానికి దూరం చేయడంతో పాటు.. సీఎం కావాలనే నా ఆకాంక్ష కూడా ఒకేసారి తీరిందని అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసమైందని, తెలంగాణను పునర్ నిర్మించడమే ఇప్పుడు నా ముందున్న ఏకైక లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి మనసులో మాట బయటపెట్టారు. కాగా, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో స్పష్టమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ధీటుగా ఎదుర్కొని పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి రావడంలో విశేషంగా కృషి చేసిన రేవంత్ రెడ్డి కష్టాన్ని గుర్తించిన పార్టీ హై కమాండ్ సీఎం పదవి ఇచ్చి సముచిత గౌరవం ఇచ్చింది.

Advertisement

Next Story