కొత్త టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |
కొత్త టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : కొత్తగా తెలంగాణ పీసీసీ(TPCC) అధ్యక్షునిగా నియమించబడిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. అధిష్టానం పీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడం పట్ల సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. కాగా రెండు వారాల క్రితం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ తో ఏఐసీసీ(AICC) పెద్దలు టీపీసీసీ అధ్యక్షుని ఎన్నికపై సుదీర్ఘ మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. టీపీసీసీ రేసులో మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి ఉండగా.. కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ పగ్గాలు మహేష్ కుమార్ గౌడ్ కు ఇవ్వడం విశేషం.

Next Story

Most Viewed