CM Revanth: గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

by Shiva |
CM Revanth: గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి సందర్భంగా జంట నగరాలు గణేష్ మండపాలతో కలకలలాడనున్నాయి. లక్షల్లోనే విగ్రహాలను ప్రతిష్టించే అవకాశం ఉంది. ఇవాళ సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. గణేష్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించడంలో సర్కార్‌కు ఎలాంటి అభ్యతరం లేదని స్ఫష్టం చేశారు. మండపాల ఏర్పాటుకు వచ్చి దరఖాస్తులను పరిశీలించి స్వయంగా విద్యుత్ అధికారులు వారికి ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. నిమజ్జన ఏర్పాట్ల సమయంలో మండపాల నిర్వాహకులకు, ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ ఉండాలని అన్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ మండలపాలను ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇక నవరాత్రుల పాటు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed