కొండా సురేఖ VS కేటీఆర్.. మీడియా, సోషల్ మీడియా సంస్థలకు కోర్టు నోటీసులు

by Y.Nagarani |
కొండా సురేఖ VS కేటీఆర్.. మీడియా, సోషల్ మీడియా సంస్థలకు కోర్టు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: తనపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యల కారణంగా పరువుకు భంగం కలిగిందని పేర్కొంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వేసిన రూ.100 కోట్ల పరువునష్టం దావా కేసుపై సిటీ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి.. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్న కోర్టు.. ఆ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది. భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని కొండా సురేఖకు సూచించింది.

అలాగే.. కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని ప్రసారం చేసిన, రాసిన మీడియా వెంటనే ఆ కథనాలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. అలాగే అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఆ వీడియోలను తొలగించాలని పేర్కొంది. యూ ట్యూబ్ (Youtube), ఫేస్ బుక్ (Face Book), గూగుల్ (Google) సంస్థలకు సైతం ఈ మేరకు సిటీ సివిల్ కోర్టు (City Civil Court) నోటీసులు జారీ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడిన కోర్టు.. ఎలాంటి పబ్లిక్ డొమైన్ లోనూ సంబంధిత వ్యాఖ్యలు ఉండరాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed